TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాడి ఘటనపై మంత్రి వివేక్ స్పందించారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడిలో ఒక కానిస్టేబుల్కు తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయని.. అలాగే కాంగ్రెస్ కార్యకర్త కూడా గాయపడ్డారని తెలిపారు.
బాపట్ల: ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ యు. ఉమా మనాలి అడ్వెంచర్ క్యాంప్కు ఎంపికయ్యారు. గుంటూరులో జరిగిన ఎంపికల్లో సుమారు 40 మంది క్యాడెట్లు పోటీ పడ్డారు. శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాల ఆధారంగా సీఎస్ఈ 3వ సంవత్సరం చదువుతున్న ఉమాను అధికారులు ఎంపిక చేశారు. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు మనాలిలో ఈ క్యాంప్ జరగనుంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 75K డాలర్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.
KRNL: పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 104వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని JAC నాయకులు డిమాండ్ చేశారు. ఈ దీక్షలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు జగన్ మాదిగ, కిరణ్ మాదిగ, భూదెబ్బ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు.
E.G: మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం శనివారం నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ శుక్రవారం వెల్లడించారు.
NGKL: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామస్వామి కల్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలు భక్తులకు ఇంటి వద్దకే అందించేందుకు TGSRTC లాజిస్టిక్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. 9154298609 నెంబర్ను సంప్రదించి, రూ. 151 చెల్లించి బుకింగ్ చేసుకోవాలన్నారు.
ప్రకాశం: దర్శి పట్టణంలో మార్చి 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మ.3 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. దర్శి ప్రజల ఆరోగ్యం బాధ్యత తాను తీసుకున్నానన్నారు. ఏడాది కిందట మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తే దాదాపు 5,000 మంది ఉపయోగించుకున్నారన్నారు.
AP: మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నేను జనసేనలో చేరలేదు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరా. ఆరోపణలపై విచారణ చేయాలని సీఎంకు లేఖ రాశా. లడ్డూ విషయంలో వైవీ సుబ్బారెడ్డిని వెనకేసుకు రాలేదు. వైవీని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అలా చేస్తే మొదట సంతోషించేది నేనే’ అని పేర్కొన్నారు.
NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సీడం గంగారంకు చెందిన పెంకుటిల్లు గోడ కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. గోడ కులే సమయంలో ఇంట్లో ఉన్న ఆత్రం రాజు, అత్రం రవి, అత్రం వినేష్లకు గాయాలయ్యాయి. హుటాహుటీన కాలనీ వాసులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట పట్టణంలోని శ్రీమార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. భక్తి ద్వారా జీవితంలో మానసిక ప్రశాంతతా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
NLG: ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని నల్లగొండ RM కే. జానీ రెడ్డి తెలిపారు. శుక్రవారం లాజిస్టిక్ రూపొందించిన గోడపత్రికను ఆయన అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 27న భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో, ఏప్రిల్ 3 వరకు రూ. 151 చెల్లించి తలంబ్రాలు ప్యాకెట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
WG: మార్చి 14న తణుకులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తణుకు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల ప్రమాదాలు కేసులు, కుటుంబ తగాదాల కేసులు రాజీ చేసుకోవచ్చని చెప్పారు. లోక్ అదాలతో ద్వారా విలువైన సమయం, డబ్బులు ఆదా చేసుకోవచ్చని ఆమె వివరించారు.
VKB: కాడ్లాపూర్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. తమ భూములను కాపాడుకోవడమే లక్ష్యమని రైతులు స్పష్టం చేశారు.
NRPT: ధన్వాడ(మం) కేంద్రంలోని బీసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పాత హరిజనవాడ ప్రాంతాల్లో మురుగు కాలువల్లో మురుగునీరు నిలిచి దోమల బాధ ఎక్కువైందని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు వచ్చేవరకు మురుగు కాలువలను శుభ్రం చేయరా అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగు కాలువను శుభ్రం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 17 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 10 సార్లు విజయం సాధించింది. 3 మ్యాచ్లు టై అయ్యాయి. అలాగే, 7 ప్రపంచకప్ మ్యాచ్లలో ఇంగ్లండ్ 4, న్యూజిలాండ్ 3 మ్యాచ్లలో గెలిచాయి. మొత్తంగా న్యూజిలాండ్పై ఇంగ్లండ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.