నాగర్కర్నూల్ మండల పరిధిని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గురించి హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: కనగానపల్లి మండలం నెమళివరం, పాతపాళ్యం గ్రామాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం పర్యటించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించి, కొత్త రోడ్డు మార్గాల అవసరాలపై గ్రామస్థులు, టీడీపీ నాయకులతో చర్చించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో సమావేశమై మీ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆమె హామీ ఇచ్చారు.
KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని YCP మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక YCP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గోడౌన్ నుంచే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అమ్ముకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డుదారులకు ప్రతినెల అరకిలో చక్కెర మినహా ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదన్నారు.
ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆలోచన మేరకు ఆదివారం “నా ఊరు – నా బాధ్యత” సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువత స్వచ్ఛందంగా పాల్గొని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో శ్రమదానం చేశారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న యువత తెలిపారు.
HNK: పట్టణ కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇవాళ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ సహకారంతో వైద్య నిర్వహించారు. కాలనీలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా BRS రాష్ట్ర నాయకుడు, ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేష్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సమాచార హక్కు శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ లో వేరువేరుగా స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వచ్చిన అతిథులకు పూలమాలతో స్వాగతం చెప్పి గర్భాలయంలో స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐవో జోనల్ సీఐగా పని చేస్తున్న శ్రీరాం కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన జిల్లాలోని పొదిలి, దర్శి, కందుకూరు ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను ఆయన పరిష్కరించారు. దీంతో సీఐ శ్రీరామ్ ప్రతిష్టాత్మమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.
KRNL: ఎమ్మిగనూరు ఆర్ & బీ గెస్ట్ హౌస్లో గౌరవ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఇవాళ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ‘పీఎం సూర్య ఘర్ పథకం’పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ తీర్మానంతో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి కరీంపేట, పాపయ్య పల్లె ప్రజలకు ఉపశమనం లభించనుంది. పాలకులు మారిన రోడ్డు విస్తరణ చేస్తానని పలుమార్లు వాగ్దానాలు చేసి ఏళ్లు గడిచినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు వెడల్పు తో ప్రమాదాల నివారణ తగ్గుతుందన్నారు.
KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సాకారం చేసిందని కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేల్లి వీరయ్య అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం పెద్దమండవలో ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశాలు చేశారు. గత ప్రభుత్వం పేదల ఇళ్లపై నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కాగితోజు స్వర్ణలత గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోపా డివిజన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి పార్దివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో పైజైన్ పనుల కోసం జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరిమద్దల గ్రామంలో కొత్త బోరు, పైప్లైన్ పనులకు రూ.5 లక్షలు, గని గ్రామంలో వాల్మీకి వీధిలో నీటి సమస్యకు రూ.4 లక్షలు అవసరమన్నారు.
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని గ్రంథాలయ నూతన కేంద్ర పాలకురాలిగా వరలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి బదిలీపై ఆమె ఇక్కడికి రాగా, గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన స్వామి ఆర్మూర్ గ్రంథాలయానికి వెళ్లారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యాలయంలోని పుస్తకాలు, రికార్డులు, ఫర్నిచర్ను ఆమెకు అప్పగించారు. రీడర్లకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.
NLG: హైదరాబాద్లోని నార్ముల్ డెయిరీ ఆర్థిక, పరిపాలనా సమస్యలపై ఇవాళ జరిపిన సమీక్షలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్డీడీబీ ఛైర్మెన్ మీనేష్ షా పాల్గొన్నారు. డెయిరీని గట్టెక్కించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా, ఎన్డీడీబీ వారు సానుకూలంగా స్పందించారు. సంస్థ పునరుద్ధరణే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగిందని వారు తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు DGP తెలిపారు. CP సన్ ప్రీత్ సింగ్, తదితరులు ఉన్నారు.