MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామ శివారు మామిడి తోటలో ఇవాళ కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 25 పందెం కోళ్లు, రూ.65,000 నగదు, ఒక కారు, 5 ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పెనుమూరు మండలంలో వరుసగా కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇతర కేబుల్ వైర్లు అపహరించబడుతున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సత్యసాయి: జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పెనుకొండకు చెందిన ఎం. హరీశ్ను నియమిస్తూ పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. హరీశ్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
ADB: ఇచ్చోడ మండలం గుండాల గ్రామ శివారులో ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను ఇచ్చోడ FRO నాగవత్ స్వామి, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ గుర్తించారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.
NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రాత్లవత్ రాములు (91) మరణించారు. SI మహేశ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఐ20 కారు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న రాములను బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో రూ.96 లక్షల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం అధికారులు చేపట్టారు. గతవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాంకు గ్రామంలో నూతన రోడ్డు వేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జయరాం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
AP: మాజీ సీఎం జగన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు.
E.G: రాజమండ్రి ఇన్నిస్ పేట గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ సెంటర్ నుండి ఆర్య వైశ్య రామాలయం వరకు రోడ్, డ్రైనేజీ వర్క్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా మంగళవారం ఆర్మ్సీ అధికారులు రహదారి మళ్లించారు. వాహనదారులు ప్రక్కన అన్నపూర్ణ థియేటర్ రోడ్, ప్రత్యామ్నాయ మార్గాల్లోనికి వెళ్లాలని సూచించారు. పనులు పూర్తయ్యే వరకు అంతరాయానికి సహకరించాలని కోరారు.
ELR: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ మెంబర్షిప్ కాదని, ఇది ఒక బాధ్యత, ఒక నిబద్ధత, ఒక సంకల్పం అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జీ రెడ్డి అప్పల నాయుడు అన్నారు. మంగళవారం ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50 డివిజన్ లోను వివిధ సెంటర్లలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు జరుగుతున్న శిబిరాలను ఆయన సందర్శించారు.
KMR: నస్రుల్లాబాద్తో పాటు సంగెం, మైలారం, నాచుపల్లి గ్రామాల్లో కోతులు ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోతుల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం, తుర్కపల్లి డివిజన్ పరిధి వెంకన్న కాలనీలో మంగళవారం సుమారు రూ.39 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్కును పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ తేదీన స్వామి వారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవ వేడుకలు చూసేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిపారు.
SKLM: టెక్కలిలోని ఎన్టీఆర్ నగర్లో మండల బీజేపీ అధ్యక్షులు జర్జాన రాంజీ మంగళవారం పర్యటించారు. ఈ మేరకు కాలనీలోని పలు వీధులను పరిశీలించి, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, చెత్త బుట్ ల్లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డయేరియా వ్యాధి ప్రబలతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన హోంగార్డుల ట్రాన్స్ఫర్పై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కరీంనగర్ సీపీ 337 మంది హోంగార్డుల వద్ద డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారని, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం విధితమే. 186 మంది హోంగార్డుల వద్ద ఒక్కో హోంగార్డు నుంచి రూ.1 లక్ష చొప్పున రూ.1.86 కోట్లు వసూలు చేశారన్నారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని జ్యోతి నగర్లో అభివృద్ధి పనులకు కౌన్సిలర్ పుల్లూరి తిరుమల కళ్యాణ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సహకారంతో రూ.4 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.