వరంగల్ నగరంలోని ఎన్ఐటిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి వ్యక్తిగత కారణాలతో కొంతమంది విద్యార్థుల మధ్యవాగ్వాదం చెలరేగి దాడులకు చేసుకున్నారు.ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలు కాగా,వారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మంగళవారం కళాశాల అధికారులు సంబంధిత విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.