BDK: మణుగూరు ఉపరితల గని భూ నిర్వాసిత గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్యాకేజీ అందించడంలో అవినీతికి తావు లేకుండా నష్టపరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. బుధవారం స్థానిక స్థానిక భవనంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. దమ్మక్కపేట గ్రామ ప్రజలు బూడిదతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
AP: విశాఖ తీరంలో ‘మిలాన్-2026’ విన్యాసాలు ఘనంగా ముగిశాయి. INS విక్రాంత్ యుద్ధ నౌకపై మిలాన్ ఈ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన నౌకాదళ ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
SRD: సదాశివపేట మండలం నందికంది వాగులో 35 -45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లూ కలర్ డ్రాయర్ ధరించి, నడుముకు ఎర్రని దారం, ఎడమ కాలుకు నల్లని దారం కలిగి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.
CTR: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలం మొరవమీదపల్లిలో బుధవారం ఆయన పర్యటించారు. పలువురు వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వారు పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
W.G: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంల పనితీరు, విధివిధానాలపై అధికారులు స్పష్టతనివ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహనరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం ఎస్పీ స్ట్రీట్ యూపీహెచ్సీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఎన్ఎంలను వారి మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖలోనే విలీనం చేయాలన్నారు.
BDK: జాతీయ పంచాయతీ అవార్డులు 2023–24లో భాగంగా పచ్చదనం–పరిశుభ్రత విభాగంలో సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామం ఎంపిక కావడం జిల్లా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సందర్భంగా బుధవారం కలెక్టర్ సీతంపేట గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య చర్యలను సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం కార్యక్రమాలు అభినందనీయం అన్నారు.
VKB: పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమేనని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులను ఆశీర్వదించారు.
రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. అలాగే, అభిషేక్, తిలక్ ఫామ్ విషయంలో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. ‘వారు రెండు బౌండరీలు బాదితే అంతా సర్దుకుంటుంది’ అని తెలిపాడు. పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు.
WGL: వరంగల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు పరీక్షలో జనరల్ మొత్తం 5680 విద్యార్థులకు గాను 5491 హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 767 విద్యార్థులకు గాను 694 హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మలలు పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు.
RR: గోపనపల్లి ప్రాంతంలో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. జీహెచ్ఎంసీ, రామ్కీ ఫౌండేషన్, ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని స్థాపించనున్నాయి. నిరాశ్రయ జంతువులకు ఆశ్రయం, వైద్య సేవలు, శస్త్రచికిత్సలు, టీకాలు, పునరావాస సదుపాయాలు కల్పించేందుకు ఆధునిక సదుపాయాలతో కేంద్రం రూపుదిద్దుకోనుంది.
NZB: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574(97%) హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ కోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మైనంపల్లి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రెండు రోజుల ముందు ఓపెన్ జిమ్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసి హడావుడి చేశారు. కేవలం ఎన్నికల ప్రచార కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బుధవారం ఎన్నికలు పూర్తయ్యాక ఆశిలాఫలకాన్ని పక్కకు తొలగించి పాత మున్సిపాలిటీ భవనంలో ఉంచినట్లు స్థానికులు తెలిపారు. ఇట్టి దృశ్యాలు సామాజికమద్యంలో వైరల్ గా మారాయి.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సందర్శించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో ఎమ్మెల్యే భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమావేశమై మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.