కృష్ణా: గుడివాడ టిట్కో కాలనీకి మల్లేశ్వరరావు కుమారుడు అందే నాగ సతీష్ కుమార్ గత 3 నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. తలనొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో సతీష్ అపార్ట్మెంట్పై అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బుధవారం వైద్యులు నిర్ధారించారు.
MNCL: 10వ తరగతి వార్షిక పరీక్షల కార్యాచరణ ఖరారైందని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండలం అంతిరెడ్డి గూడ గ్రామంలో అచిని సత్తయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
AP: అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినవన్నీ అసత్యాలేనని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గతంలో తిరుమలపై వైఎస్ తెచ్చిన జీవోలను రద్దు చేస్తామని అన్నది చంద్రబాబేనని గుర్తు చేశారు. వైవీ సుబ్బారెడ్డి భార్యపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితువు పలికారు. వైవీ సతీమణి సనాతన హిందూ స్త్రీ అని ఆమె స్పష్టం చేశారు.
KDP: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు మనసుపెట్టి పని చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 22A, మ్యూటేషన్, వెబ్ల్యాండ్ కరెక్షన్స్ తదితర అంశాలపై మండలాల వారీగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్ల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ బుధవారం సాయంత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి గరిష్ట వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
TG: ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని MLC మల్క కొమురయ్య తెలిపారు. PRC అమలు చేసిన తర్వాతనే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ స్వీకరించాలని కోరారు. DSC 2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఈ విధానం అమలులో ఉద్యోగులకు ఉన్న సందేహాలను ప్రభుత్వం నివృతి చేయాలన్నారు.
ATP: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం నిర్వహించిన త్రో బాల్ మ్యాచ్లో MLA పరిటాల సునీత జట్టు విజయం సాధించింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి జట్టుతో జరిగిన ఈ పోటీలో సునీత జట్టు ప్రతిభ చాటి గెలుపొందింది. వృత్తిపరమైన పనులతో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఉత్సాహాన్నిచ్చాయని ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు.
NDL: యఫ్లతో తంటాలు పడుతూ చంటి పిల్లలు, గర్భిణులకు సేవలు అందిస్తున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని CITU పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు. నేడు నంది కొట్కూరు ICDS కార్యాలయం వద్ద సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ.. అంగన్వాడీలు 3వ రోజు దీక్షలు చేపట్టారు. 2024లో 42 రోజులు సమ్మె చేసిన YCP ప్రభుత్వం, ప్రస్తుత కూటమి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష గురువారం మంత్రి అచ్చెన్నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వజ్రపుకొత్తూరు మండలం, మంచినీళ్ళపేట గ్రామంలో మత్స్యకారుల కోసం మినీ జెట్టి నిర్మాణం కోసం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
CTR: మేత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తు 15 అడుగుల నీటి సంపులో పాడి ఆవు పడిపోయిన ఘటన పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపాన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహకారంతో తాళ్లు నిచ్చెనలను ఉపయోగించి సంపులో నుంచి సురక్షితంగా అవును బయటికి తీశారు.
కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆలూరు మండలంలో ఏర్పాటు చేసిన శనగ మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. శనగ పంటను క్వింటాకు రూ. 5,875 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు.
ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించని వారిపై చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
పచ్చి పాలు తాగొద్దని, చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పాలు అయినా సరే పచ్చిగా తాగటం గాని, పాశ్చరైజ్ చేయకుండా ముట్టుకోవద్దని తెలిపారు. పచ్చి పాలల్లో సూక్ష్మ క్రిములు ఉంటాయని చెప్పారు. ఇళ్లలో బర్రెల నుంచి తీసిన పాలల్లోనూ సూక్ష్మ క్రిములు ఉంటాయని, అందువల్ల వేడి చేసుకుని తాగాలని సూచించారు.
ATP: మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు ముత్యాల సంపత్కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2020లో శింగనమల మండలంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి చిన్నబాబు.. నిందితుడికి శిక్షతో పాటు రూ.4వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.50వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.