• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిన్నస్వామి స్టేడియంలో ‘నో ఫిజికల్ టిక్కెట్స్’

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఇకపై ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లను అనుమతించబోమని తెలిపారు. కేవలం డిజిటల్ QR కోడ్ టిక్కెట్లను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. టిక్కెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 06:49 PM IST

మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

SRPT: ఈ నెల 29న జరిగే మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ నాయకుడు శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు చీకూరి అశోక్ కుమార్, సెక్రటరీ వేణు, ఉద్యోగులు పాల్గొన్నారు.

March 25, 2026 / 06:48 PM IST

గురుకుల పాఠశాలలో సీటు సాధించిన విద్యార్థులు

KMR: రామారెడ్డి మండలం గోకుల్ తండా ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం ఖదీర్ తెలిపారు. ఇటీవల పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.

March 25, 2026 / 06:47 PM IST

’28న ఎర్త్ అవర్.. లైట్లు ఆఫ్ చేయండి’

VSP: ఎర్త్ అవర్ 2026 సందర్భంగా మార్చి 28 శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను ఆఫ్ చేయాలని జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్ నగర ప్రజలను కోరారు. World Wide Fund for Nature ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో నిర్వహించబడుతోందన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు.

March 25, 2026 / 06:47 PM IST

కలెక్టర్‌ను కలిసిన చీర్కపల్లి ప్రజాప్రతినిధులు

WNP: చీర్కపల్లి గ్రామ సర్పంచ్ పగడాల రవి నేతృత్వంలో ఉపసర్పంచ్ పరుశురాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమ్మి మల్లేష్, వార్డ్ సభ్యులు దొడ్ల కాశీమ్లు వనపర్తి జిల్లా కలెక్టర్ను కలిశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి విస్తృతంగా చర్చించారు. గ్రామంలో జరుగుతున్న పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి కలెక్టర్కు వివరించారు.

March 25, 2026 / 06:46 PM IST

CPIML లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ.. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 25, 2026 / 06:45 PM IST

‘గర్భస్థ నిర్ధారణ పూర్తిగా నిషేధం’

SRCL: గర్భస్థ నిర్ధారణ పూర్తిగా నిషేధమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్ల యజమానులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా గర్భస్థ పిండ నిర్ధారణ చేస్తే రూ 10 వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు.

March 25, 2026 / 06:44 PM IST

ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

MNCL: జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

March 25, 2026 / 06:44 PM IST

‘వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి’

SRPT: వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని ఎస్సై క్రాంతికుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, రోడ్డు నియమ నిబంధనలను పాటించాలన్నారు.

March 25, 2026 / 06:42 PM IST

టీడీపీ బలోపేతంపై క్లస్టర్ శిక్షణ

KRNL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ట్రైనింగ్ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ గణేకల్లు విరూపాక్షి ఇవాళ పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సహా నేతలు శిక్షణ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలు, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.

March 25, 2026 / 06:41 PM IST

GOOD NEWS.. గడువు పెంపు

MHBD:ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువత కొరకు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.జిల్లాల్లో 70 నుంచి 90% సబ్సిడిపై EV టూవీలర్లు, ఆటోలు,సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హుత గలవారు ఏప్రిల్ 2లోగా tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

March 25, 2026 / 06:40 PM IST

పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే..!

ఏలూరు: జిల్లా కైకలూరు మండలం కొల్లేటి కోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవాలయం నందు ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 91 రోజులకు గాను రూ. 29,65,308 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కే. శ్రీనివాస్ తెలిపారు. అలాగే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 06:40 PM IST

సీఎం చంద్రబాబుకు అధికారుల స్వాగతం

గుంటూరులో జరిగిన ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు హాజరైన విషయం తెలిసందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జీఎంసీ కమిషనర్ మయూర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎం రాకతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

March 25, 2026 / 06:40 PM IST

పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి విలువ తగ్గడం. భారత్ ఎక్కువగా ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల గ్లోబల్ మార్కెట్ ప్రభావం నేరుగా పడుతుంది. రూపాయి విలువ తగ్గితే దిగుమతి ఖర్చు పెరుగుతుంది. అదనంగా ప్రభుత్వం విధించే పన్నులు, రవాణా ఖర్చులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. ఇటీవల యుద్ధ పరిస్థితులు చమురు ధరలు పెరగడానికి ప్రధాన కారణం.

March 25, 2026 / 06:38 PM IST

అక్రమ ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్

KNR: వీణవంక మండలం రామకృష్ణాపూర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. SI ఆవుల తిరుపతి వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం హనుమాన్ గుడి సమీపంలో తనిఖీలు నిర్వహించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు డ్రైవర్లు పూదరి సంతోశ్, సంపంగి రాములు, యజమాని పెరిమల్ల రాజయ్యపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా వదలమని అన్నారు.

March 25, 2026 / 06:37 PM IST