SRPT: ఈ నెల 29న జరిగే మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ నాయకుడు శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీలో ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు చీకూరి అశోక్ కుమార్, సెక్రటరీ వేణు, ఉద్యోగులు పాల్గొన్నారు.