SDPT: మూసీ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం చేసే ప్రతి పని వెనుక భూముల పంచాయతీ, వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు.
PDPL: ముత్తారం మండలంలోని లక్కారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించే వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు కేవలం సర్వేలతో కాలయాపన చేస్తూ తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, అప్పటివరకు పోరాటం ఆపేది లేదన్నారు.
MHBD: బయ్యారం మండలం బీరొనిమడుగు, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో 30 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. చేతికి వచ్చిన పంట నెల రావడంతో అన్నదాతలు కన్నీటి పరేమయ్యారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
PLD: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుడు కేశవరావు కుమారుని వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాటసాని జయమ్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.
PPM: ఇంటర్మీడియట్ పరీక్షలు రాయిబోయే విద్యార్థులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఆంతా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే మీ భవిష్యత్ బాగుండడంతో పాటు కుటుంబానికి, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళవుతారన్నారు.
NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లలో ముత్యాలమ్మ విగ్రహానికి ఆ కాలనీ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘనంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. రానున్న రోజులలో గుడి నిర్మాణం చేసుకుని పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ నాయకుడు దున్న ముత్యాలు అన్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దున్న ఆంజనేయులు పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సొంతింటి కల నెరవేరిందని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కవిత, దేవేందర్ తెలిపారు. అనంతరం వారు HIT TVతో మాట్లాడుతూ.. గత 10 సం,గా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్పంచ్ శేఖర్ గౌడ సహకారంతో నెరవేరిందని అన్నారు.
ATP: గుత్తిలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాలలో సోమవారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్దకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం ఆగినిపర్రు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి బాల, బాలికల ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు.
ADB: దైవారాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో సంత్ గాడిగే బాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
ADB: బోథ్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా తనవంతుగా కృషి చేస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, నారాయణ, సంతోష్ తదితరులున్నారు.
SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ. 6.75 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNV D ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
ప్రకాశం: కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో రైజ్ సెంటర్లో నిర్వహించిన ఏఐ ఫర్ షూర్ వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధునిక సాంకేతికత ద్వారా వ్యాపారాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామిక వేత్తలను టెక్నాలజీతో శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.