• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పంచాయతీలో మౌలిక వసతులు కల్పించండి’

అన్నమయ్య: మదనపల్లె మండలం కోళ్ల బైలు పంచాయితీలో మౌలిక వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక ప్రజలతో కలసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య, వీధిలైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

December 10, 2024 / 04:40 PM IST

‘రైతులను మోసం చేసి విత్తనాలు అమ్మారు’

ELR: పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతులను మోసం చేసి స్వర్ణ కేళీ రకం విత్తనాలు అంటగట్టారని ఇవి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని జిల్లా కౌలు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు కేతా గోపాలన్ తెలిపారు. 1318 రకం సాగు చేసిన రైతులు ఎకరాకు 35 బస్తాలు దిగుబడి సాధిస్తే స్వర్ణ కేరళీయ రకం సాగుచేసి 12 నుంచి 14 బస్తాలు మాత్రమే దిగుబడి సాధించారని అన్నారు.

December 10, 2024 / 04:39 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన DMHO

KMM: నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రోగులను వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

December 10, 2024 / 04:39 PM IST

నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు

ప్రకాశం: మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీ నుంచి నుండి 19వ తేదీ వరకు మండలంలోని పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. 16, 17వ తేదీలలో ఒక బ్యాచ్ సభ్యులకు 18, 19వ మరొక బ్యాచ్ సభ్యులకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

December 10, 2024 / 04:37 PM IST

డీజీపీని కలిసిన మంచు మనోజ్

TG: మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు వెళ్లిన మంచు మనోజ్ భార్యతో కలిసి శివధర్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కంప్లైంట్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి సమర్పించారు. అంతేకాకుండా గత ఆదివారం పది మంది వ్యక్తులు.. తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని కంప్లై...

December 10, 2024 / 04:37 PM IST

‘అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్న విద్యార్థులు’

ASR: అరకు సీడాప్ స్కిల్ కళాశాల విద్యార్ధులు ఇటీవలే పాల్గొన్న స్కైప్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిలో 10 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ వర్మ తెలిపారు. ఈ అపాయింట్‌మెంట్ లెటర్లను స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ PSN మూర్తి విద్యార్ధులకు అందించారు. నోవోటెల్ 8 మందికి, రాడిసన్ బ్లూ హోటల్ ఇద్దరకు ఆఫర్ లెటర్లు ఇచ్చామన్నారు.

December 10, 2024 / 04:34 PM IST

పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ సమావేశం

ADB: ఉట్నూర్ పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్ల నియామకంపై మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరణి రాజేష్, బాబా శ్యాం టైగర్, కాంగ్రెస్ అధ్యక్షులు ఖయ్యూం ఉన్నారు.

December 10, 2024 / 04:33 PM IST

నాగచైతన్య సరసన ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ?

నాగ చైతన్య- కార్తిక్ వర్మ దండు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని అనుకున్న మేకర్స్ తాజాగా హైపర్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర బ...

December 10, 2024 / 04:33 PM IST

‘హైవే రోడ్డు నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలి’

KMM: సత్తుపల్లి మండల పరిధిలో జరుగుతున్న హైవే రోడ్డు నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ నేత దయానంద్ సింగరేణి అధికారులను కోరారు. మంగళవారం రేచర్ల, లింగపాలెం రైతులతో కలిసి సింగరేణి పిఓను కలిసి వినతి పత్రం అందించారు. హైవేలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదని, తక్షణమే వారికి పరిహారం అందే విధంగా చూడాలని అధికారులను కోరారు.

December 10, 2024 / 04:31 PM IST

అంబాజీపేటలో గ్రామ రెవెన్యూ సదస్సు

కోనసీమ: అంబాజీపేట మండలంలోని ఇరుసముండ గ్రామంలో రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో అంబాజీపేట మండలం తహసీల్దార్ వెంకటేశ్వరి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉండకూడదని, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు.

December 10, 2024 / 04:31 PM IST

ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు:కలెక్టర్

KKD: ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్క అని కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రి వారి మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డును ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఫ్యామిలీ కార్డు వల్ల మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు మరింత చేరువ అయ్యేందుకు ఎంతో దోహద పడతాయన్నారు. కుటుంబ సంరక్షణను, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఫ్యామిలీ కార్డ్ ఒక ముందడుగని తెలిపారు.

December 10, 2024 / 04:31 PM IST

జూనియర్ కళాశాల ఏర్పాటుకు స్థలం పరిశీలించిన కలెక్టర్

NLG: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తిప్పర్తి మండల కేంద్రానికి జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కళాశాల ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఆదర్శ పాఠశాల సమీపంలో స్థలాన్ని సర్వే చేసి నివేదికను అందజేయాలని తహసీల్దార్ స్వప్నను ఆదేశించారు. ఆమె వెంట తాహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

December 10, 2024 / 04:30 PM IST

ఈ నెల 31లోగా రబీ టెండర్ ధాన్యం అప్పగించాలి: కలెక్టర్

PDPL: ఈనెల 31లోగా రబీ 2022- 23 సీజన్‌కు సంబంధించి పెండింగ్ టెండర్ ధాన్యాన్ని తప్పని సరిగా బిల్డర్‌కు అప్పగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, అధికారణులతో పెండింగ్‌లో ఉన్న ఆక్షన్ ధాన్యంపై సమీక్షించారు.

December 10, 2024 / 04:29 PM IST

మెగాస్టార్‌ని వెనక్కి నెట్టిన ధోనీ

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతని మార్కెట్ విలువపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్‌ల కంటే 2024 ప్రథమార్ధంలో అత్యధిక బ్రాండ్‌లకు ఎండోర్స్‌మెంట్ చేస్తున్న వ్యక్తిగా ధోనీ నిలిచాడు. ఈ మేరకు ‘TAM మీడియా రిసెర్చ్‌’ నివేదిక విడుదల చేసింది. ధోనీ 42 బ్రాండ్‌లతో మొదటి స్థానంలో ఉండగా.. అమితాబ్ (...

December 10, 2024 / 04:28 PM IST

‘టీపీ కోట రోడ్డు మంజూరుకు కృషి చేస్తా’

TPT: నాగలాపురం-చిన్న పాండూరు (వయా టీపీ కోట) రోడ్డు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. మంగళవారం నాగలాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు. అవసరమైతే టీపీకోట రోడ్డు ఆవశ్యకతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళి పనులు చేపట్టడానికి కృషి చేస్తానన్నారు.

December 10, 2024 / 04:27 PM IST