TG: ప్రజలు నమ్మి ఓటేశారని, కుర్చీలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని.. ఆ తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరఫున పేదవాళ్లకు సేవ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని పేర్కొన్నారు.