TG: మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ QNETపై పోలీసులు రైడ్ చేశారు. HYDలో 25 బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో HYD పోలీసులు తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 20 మంది నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
భారత జట్టు వచ్చే ఏడాది జనవరి-మార్చిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ల ‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ’ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న తమ 2026-27 క్యాలెండర్ను ప్రకటించింది. ఇందులో BGT కూడా ఉండగా.. పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్-మార్చిలో ఆసీస్ బిజీబిజీగా ఉండనుంది. 14 వారాల్లో మొత్తం 10 టెస్ట్లు ఆడనుంది.
KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు-మాల్యాల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో రైతులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. గతంలో మంజూరైన 2.5 కి.మీ తారు రోడ్డు పనులు పూర్తి కాకముందే నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు పూర్తయితే ప్రయాణికులకు 3 కి.మీ ప్రయాణ భారం తగ్గుతుంది.
ASF: వినియోగదారుల సౌలభ్యం కోసం సోమవారం జిల్లా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా SE ఉత్తమ్ జాడే ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఫిర్యాదులు స్వీకరించి సమస్యల తీవ్రతకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు.
SRPT: సమగ్ర శిక్ష పథకం కింద సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై నేటి నుంచి 25 వరకు నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు డబ్బు విలువ, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుతమైన ఆర్ధిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలనేది దీని ఉద్దేశం.
మంచిర్యాల జిల్లా పెఱిక యువజన సంఘం ఎన్నికలలో బెల్లంపల్లి పట్టణనికి చెందిన బోడకుంట సాగర్ని జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాగర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వనికి, జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
KMM: చింతకాని మండలంలో సోమవారం తెల్లవారుజామున బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపుతో కాంగ్రెస్ హామీల అమలుపై చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మండల అధ్యక్షుడు కొండా గోపి, ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్యను పోలీసులు ఇంటివద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ రోహిత్, రితేశ్, నమిత్ శర్మ కస్టడీపై HYDలోని రాజేంద్రనగర్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. అయితే కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్పై తీర్పు ఇవాళ వెలువడనుంది.
అనంతపురం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను నేరుగా 9154790350 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: గత రాత్రి అమలాపురం పట్టణ CI వీరబాబు ,పట్టణ ఎస్సైలు కిషోర్ బాబు, శ్రీనివాసు, సిబ్బంది అందరూ కలిసి ఫ్లాగ్ మార్చ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. వేసవికాలంలో రాత్రిపూట అనుమానిత వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండమని, అనుమానించే వ్యక్తులు సంఘటనల గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అకౌంటింగ్ విభాగం అధికారులకు ఆదేశించారు. ఈనెల 25న బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలకవర్గం పదవీకాలం మరో నెలలో ముగియనున్న నేపథ్యంలో ఇది చివరి బడ్జెట్ సమావేశంగా నిలవనుంది.
NZB: రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
NLR: సంగం గురుకుల పాఠశాల వద్ద సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు-ముంబై హైవేపై వెళ్తున్న సిమెంట్ లారీకి అడ్డుగా ఓ వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో సిమెంట్ లారీ ఎర్ర చెరువులోకి దూసుకెళ్లింది. ఒకవేళ ట్యాంకర్ ఎడమ వైపునకు మళ్లి ఉంటే ఇళ్లపైకి దూసుకెళ్లి పెను ప్రమాదం జరిగి ఉండేదని, కుడి వైపునకు మళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సూడాన్ సైన్యం, పారామిలిటరీ ఫోర్స్ మధ్య భీకరపోరు జరిగింది. ఈ క్రమంలో 13 మంది చిన్నారులు సహా 64 మంది మృతి చెందారు. కాగా 2023 ఏప్రిల్లో సైన్యం, ప్రత్యర్థి పరామిలటరీ బలగం ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ మధ్య అధికార పోరు మొదలై దేశవ్యాప్తంగా యుద్ధంగా మారింది. అప్పటి నుంచి సూడాన్ తీవ్ర అశాంతిలోకి వెళ్లింది.
MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మురళి, ఆంజనేయులు, శేఖర్, భారత్, నరేష్, శశికాంత్ తదితర విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.