• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెద్దపల్లి కార్మిక శాఖ అధికారిణి పై మంత్రికి ఫిర్యాదు

PDPL: పెద్దపల్లి కార్మిక అధికారిణి హేమలత తీరుపై భవన నిర్మాణ కార్మికులు ఆదివారం మంత్రి వివేక్ వెంకట స్వామికి ఫిర్యాదు చేశారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన అధికారిణి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చెన్నూర్‌లో కార్మిక, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి దళిత బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.

March 23, 2026 / 06:44 AM IST

‘నామా పద్యాలు.. నిత్య సత్యాలు’ సాహితీ సంకలనం ఆవిష్కరణ

KMM: జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిన్న ప్రముఖ సాహితీవేత్త నామ రామారావు రచించిన నామా పద్యాలు- నిత్య సత్యాలు సాహితీ సంకలనాన్ని ఎమ్మెల్సీ తాతా మధు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, ఫేమా కన్వీనర్, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు.

March 23, 2026 / 06:43 AM IST

బీజేపీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

SRCL: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో వేములవాడ పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను బీజేపీ నాయకులు ఖండించారు.

March 23, 2026 / 06:43 AM IST

పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

ATP: జిల్లా పట్టుపరిశ్రమ ఉద్యోగుల పరపతి సంఘం ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడు డైరెక్టర్ల స్థానాలకు 237 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 6న నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, 8న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.

March 23, 2026 / 06:40 AM IST

లచ్చ నాయక్‌కు నివాళులర్పించిన మంత్రి సీతక్క

MHBD: ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చ నాయక్ ఇటీవల మృతి చెందగా, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్‌ను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

March 23, 2026 / 06:39 AM IST

నేడు పాండురంగ స్వామి ఆలయంకు రానున్న ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేటలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో నేడు పుష్కర కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరుకానున్నారు. భక్తి శ్రద్ధల మధ్య జరిగే ఈ వేడుకకు స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

March 23, 2026 / 06:39 AM IST

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో టెండర్లు..!

VSP: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దుకాణాలు ఏర్పాటు చేయడానికి తూర్పు కోస్తా రైల్వే టెండర్లు ఆహ్వానించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ తెలిపారు. ఐస్‌క్రీమ్‌లు, శీతలపానీయాలు, అల్పాహారం, తినుబండారాలు, ఫాస్ట్‌ఫుడ్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్, న్యూడిల్స్ వంటి స్టాల్‌లు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 30లోగా టెండర్లు దాఖలు చేయాలన్నారు.

March 23, 2026 / 06:38 AM IST

అంగన్వాడి టీచర్లకు కొత్త స్మార్ట్ ఫోన్లు

JGL: అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 1,065 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 1,037 ప్రధాన కేంద్రాలు, 28 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పాతబడగా కొత్త ఫోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజు పోషణ్ ట్రాకర్ యాప్‌లో 14 రకాల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

March 23, 2026 / 06:37 AM IST

‘తరచుగా దత్తత గ్రామాలను సందర్శించాలి’

VZM: పోలీసు సిబ్బంది తరుచూ తమకు కేటాయించిన దత్తత గ్రామాలను సందర్శించాలని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. ఆదివారం ఆయన ఎస్.కోట, కొత్తవలస పోలీసు స్టేషన్‌లను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. దత్తత గ్రామాలలో శాంతిభద్రతల పరిస్ధితులను తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు.

March 23, 2026 / 06:36 AM IST

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

KNR: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన పల్లె రవి అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారి విధుల్లో భాగంగా చెట్టు ఎక్కిన రవి దిగే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. సహచరులు వెంటనే గమనించి 108 అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్‌కు తరలించారు.

March 23, 2026 / 06:36 AM IST

ALERT: ఇవాళే లాస్ట్ డేట్

APలోని విద్యాసంస్థల్లో MBA, MCA కోర్సుల ప్రవేశానికి సంబంధించి AP ICET-2026కు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగినవారు అర్హులు. మే 2న పరీక్ష నిర్వహిస్తారు. అటు TGలోనూ TG ICET 2026కు ఇవాళే చివరి రోజు. పరీక్ష ఫీజు రూ.750. SC/ST/దివ్యాంగులకు రూ.550. 13-14 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

March 23, 2026 / 06:36 AM IST

నేడు సైదాపురానికి ఎమ్మెల్యే రాక..!

NLR: సైదాపురంలో సోమవారం పాలూరులో జరిగే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొంటారని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాలపై తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. 

March 23, 2026 / 06:35 AM IST

కుందూ నదిలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

KDP: కుందూ నది వంతెన కింద ఈతకు వెళ్లిన గొడుగు సురేశ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. మృతుడు ఆళ్లగడ్డ టౌన్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను పెద్దముడియంలో ఎద్దుల బండలాగుడు పోటీలను వీక్షించడానికి శనివారం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న నీటిలో మునిగి కనిపించలేదని, తిరిగి ఆదివారం వెతకగా.. మృతదేహం కనపడిందని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:34 AM IST

కెరమెరిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

ASF: కెరమెరిలోని సాకడ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై మధుకర్ ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనలైజర్‌‌తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 23, 2026 / 06:33 AM IST

ఇసుక అక్రమ రవాణా.. ఇద్దరిపై కేసు నమోదు

GDWL: ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. తనిఖీలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాణిక్యప్ప, కురుమూర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

March 23, 2026 / 06:33 AM IST