BDK: రాములోరి గోత్రనామాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. భద్రాచలం రామయ్య కళ్యాణం సందర్భంగా తెరపైకి రాములు వారి గోత్రనామాల వివాదం బయటికి వచ్చింది. గోత్రనామాల వివాదం 2022 నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా, ఐదుగురు పండితులతో హైకోర్టు విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, రిపోర్టును ఆ కమిటీ దేవాదాయ శాఖకు సమర్పించింది.
TPT: సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం ఎదురుగా ఉన్న కాళంగి నదిలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి సన్నిధిలో జరిగే కార్యక్రమాల వేళలను ట్రస్టు వర్గాలు మార్చాయి. సోమవారం నుంచి కొత్త సమయాలు అమలులోకి రానున్నాయి. ఉదయం 8 గంటలకు వేద పఠనం, 9 నుంచి 9:30 వరకు భజనలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు వేద పఠనం, 5:45 నుంచి 6:30 వరకు భజనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో సత్యమాంబ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండలాగు పోటీలు అలరించాయి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ యూనియన్ ఛైర్మన్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎద్దుల జతలు పాల్గొన్నాయి. విజేతలకు సాయంత్రం నగదు బహుమతులు, షీల్డ్స్ అందజేసి రైతులను అభినందించారు.
AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో గల పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు.
కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామర్లకోట రోడ్డులో పేకాట స్థావరంపై సీఐ మజ్జి అప్పలనాయుడు బృందం ఆదివారం రాత్రి మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
CTR: బైరెడ్డిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 25న కోలారు జాలప్ప ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి విజయ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. నేత్ర వైద్య నిపుణుల సలహాతో లెన్స్ అమర్చడం, అవసరమైన వారికి నేత్ర శస్త్రచికిత్సలు చేస్తారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
GNTR: నిడుముక్కలలో ఉన్న హజరత్ సయ్యద్ బాజీ షాహీద్ సర్కార్ అవులియా బాబా 74వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 23 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ముజాఫర్ హజరత్ షేక్ షబ్బీర్ తాజ్ ఉల్ ఖాద్రీ చెప్పారు. ఈ నెల 23న గుసూల్, 24న చందనం, 25న అన్న సంతర్పణ ఏర్పాటు చేశామని, ఉరుసు సందర్భంగా మూడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.
BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో దగాకోరు బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా విమర్శించారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు.
SDPT: భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి తరలించేందుకు సిద్ధం చేశారు. శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సమకూర్చిన తలంబ్రాలను ఆదివారం రామరాజుకు అందజేశారు. భక్తితో సమర్పించిన ఈ తలంబ్రాలు రామయ్య సేవలో భాగం కావడం అదృష్టమన్నారు.
KRNL: కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఆదివారం మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు పరామర్శించారు. కోసిగి రమేష్, అయ్యన్నల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి కూడా ఫోన్లో బాధితులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం గుంటూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరుకానున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అరెస్ట్ సమయంలో పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ పూర్తి విచారణ కోరనున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ పెరిగింది.
TG: రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ 6 గ్యారంటీల అమలుపై రాజకీయ సెగలు రేగనున్నాయి. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనుంది. మరోవైపు, ఇదే అంశంపై బీజేపీ ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. సభ లోపల బిల్లులతో, బయట నిరసనలతో ఇవాళ రాష్ట్ర రాజకీయం హీటెక్కనుంది.
BPT: యద్దనపూడిలో పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఎస్సై రత్న కుమారి తెలిపారు. ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ధర్మ టీచర్ యూనియన్ (DTU), TPTF సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నేతలు సంపతి రమేశ్, దూస సంతోశ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై మాట్లాడడం సరికాదన్నారు.