KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు APSPDCL CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతి సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ సమయంలో 8977716661 నెంబరుకు ఫోన్ చేసుకోవచ్చు అన్నారు.
PDPL: రామగుండం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 50వ డివిజన్ లబ్ధిదారులకు కార్పొరేటర్ సతీష్, మనాలి ఠాకూర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేద ప్రజలకు CMRF వరంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NZB: ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతినెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు. నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నరు.
బాపట్లలో ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు మీడియా ప్రతినిధులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వైద్య నిపుణులు పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు అందజేస్తారు. మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: పాతపట్నం మేజరు పంచాయతీకి సంబంధించిన ఆశీల వేలం పాట సోమవారం జరగనుంది. పాటలో పాల్గొని హక్కులు పొందొచ్చని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్ చెల్లించి ఈ వేలంలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ ఆఫీస్లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని రాజీవ్ కాలనీలో రూ.35 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, SP, DFO, మార్కెట్ చైర్మన్ తదితరులు ఉన్నారు.
ATP: వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 50 గ్యాస్ ఏజెన్సీలలో వీఆర్వోలు అందుబాటులో ఉండి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
MNCL: SC 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MNCL: బెల్లంపల్లికి చెందిన పలువురు BJP నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త చర్యగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం సమంజసం కాదని నాయకులు అన్నారు.
W.G: తాడేపల్లిగూడెం బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఉగాది నాటకోత్సవాలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్.డీ. విల్సన్ శరత్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలను, కళాకారులను ఆదరించాలని, తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వెలసిల్లుతాయన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు.
AP: శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని(మార్చి 23) రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు మంత్రి సవిత, ఇతర నేతలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, విద్యకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీలో రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పారితోషికంపై రిషబ్కి మేకర్స్ 2 ఆప్షన్లు ఇచ్చినట్లు బాక్సాఫిస్ వర్గాలు పేర్కొన్నాయి. మొదటిది రూ.20 కోట్ల పారితోషికం+లాభాల్లో 33%. ఇక రెండోది లాభనష్టాలతో పనిలేకుండా రూ.80 కోట్ల రెమ్యూనరేషన్. హీరో తొలిదానికి మొగ్గుచూపుతుంటే, మేకర్స్ రెండో ఆప్షన్ బెటర్ అనుకుంటున్నారట.
SKLM: కార్గో ఎయిర్పోర్టుపై అపోహలు వద్దని నిర్వాసితులతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడు అన్నారు. ఎయిర్పోర్టు నిర్వాసిత 18 గ్రామాల ప్రజలు, నిర్వాసితులతో ఆదివారం కలెక్టరేట్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎస్పీ, కలెక్టర్ సమక్షంలో కేంద్ర మంత్రి వర్చ్యువల్ గా నిర్వాసితుల సందేహాలు తీర్చినట్లు అధికారులు తెలిపారు.
SKLM: అరసవల్లి శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ.6.86 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNVD.ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు పేర్కొన్నారు.
SDPT: చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన తుంగ పోషవ్వ ఇల్లు శిథిలావస్థకు చేరి ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పెంకుటిల్లు కూలిపోవడంతో అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకుంది. వృద్ధాప్యంతో ఉన్న పోషవ్వ ఏ పని చేయలేక పింఛనుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇల్లు కూలిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యింది. అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది.