KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన పాల్గోని మాట్లాడారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలన్నారు.