KNRL: దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాల వల్ల వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు VS.కృష్ణ, కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు కప్పట్రాళ్లలోని గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. నీరు, గాలి కలుషితమవటం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.