ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచరులపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని తెలిపాడు. ఫీల్డింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి చొరవ అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.