VSP: చింతపల్లి మండలంలో మొత్తం 16,127మంది రైతులకు గాను ఇప్పటి వరకూ 9,600మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేశామని ఏవో మధుసూదనరావు తెలిపారు. పెండింగ్లో ఉన్న 6,527మందికి రైతులకు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గెంజిగెడ్డ గ్రామంలో పర్యటించారు. ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ గడువు దగ్గర పడుతుందన్నారు.
SKLM: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో టెక్కలి MLA, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా భేటీఅయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగా భివృద్ధి, రైతుల సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిని కోరారు.
ఒడిశా ఝార్సుగూడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే-44పై పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని అందించినట్లు ఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.
నాకౌట్ మ్యాచ్లలో దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత్ను ఓడించలేదు. ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్లలో రెండుసార్లు తలపడ్డాయి. భారత్ రెండింటిలోనూ గెలిచింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో తలపడ్డాయి. భారత్ విజయం సాధించింది. 2024 ఫైనల్లో భారత్ గెలుపొందింది. IND, SA ఫామ్ను పరిశీలిస్తే.. రెండు జట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.
NZB: ఎడపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి 15 అడుగుల ఎత్తు నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, డ్రైవర్ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ను ఆదివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజలకు నాణ్యమైన శుద్ధి నీటిని అందించే ప్రయత్నంలో ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్లాంట్ యజమాని నాగరాజు మోడలియార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.
SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా, 20 మంది ప్రయాణికులకు గాయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లికి చెందిన విద్యార్థి చిత్వాన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా, మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన చిత్వాన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంలో పీఈటీ వెంకట నర్సయ్య కృషి విశేషమని పేర్కొన్నారు.
ASR: ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన ఉండాలని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయభారతి అన్నారు. విజ్ఞానయాత్రలో భాగంగా స్థానిక ఎంపీడీవో, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాలు, న్యాయస్థానాన్ని శనివారం బీఏ విద్యార్థులకు చూపించారు. వివిధ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అధికారులు, ఉద్యోగులు, విధులు వివరాలను విద్యార్థులకు వివరించారు.
TPT: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం కోటక్ మహీంద్ర మైక్రో ఫైనాన్స్ సంస్థలో ‘ట్రైనింగ్ సెంటర్ ఆఫీసర్’ భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శోభన్బాబు తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివి వయసు 21-25 సంవత్సరాల వారు అర్హులన్నారు. సమాచారం కోసం 87124 95517లో సంప్రదించాలన్నారు.
TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో విషాద ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక మిల్కీ ఆడుకుంటూ వెళ్లి నీట సంపులో పడి మృతిచెందింది. అడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASF: తీర్యాని మండల రిజర్వ్ అటవీలో చెట్లను నరికి సాగుకు ప్రయత్నించిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. FRO శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మొర్రిగూడకు చెందిన ఆత్రం గంగు అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 13 రోజుల రిమాండ్ విధించారన్నారు. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నడకను మీ శరీరానికి ప్రతిరోజూ మీరిచ్చే కానుకగా భావించండి. క్రమం తప్పకుండా రోజూ కనీసం 7 వేల అడుగులు నడవండి. నడకను ఆస్వాదిస్తూ పూర్తి చేయాలి తప్ప భారంగానో, చేయక తప్పని పనిగానో భావించకండి. ఈ అలవాటును కొనసాగించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మనసు తేలికపడుతుంది.
SKLM: టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం మంత్రి ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.
SRD: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి జాతరకు స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భక్తుల ప్రయాణ సౌకర్యార్థం బస్సును ప్రారంభించారు. ఈ స్పెషల్ బస్సును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీ అనుసరించి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.