• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

FEB 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. 9AM నుంచి 12PM వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 02:51 PM IST

పీ4తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు

AP: P3తో సంపద సృష్టిస్తున్నాము కానీ ఆర్థిక అసమానతలు తగ్గించలేకపోతున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘పీ4తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. దీంతో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. 2047 నాటికి భారత్ అగ్రదేశంగా తయారవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అసమానతలు ఉండొద్దని ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 90 శాతం విజయాన్ని మనకు అందించిన ప్రజల కోసం మనం కృషి చేయాలి’ అని తెలిపారు.

February 23, 2026 / 02:51 PM IST

గద్వాల కలెక్టర్ ప్రజావాణికి 82 పిర్యాదులు..

GDWL: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకూడదని కలెక్టర్ సూచించారు.

February 23, 2026 / 02:50 PM IST

పోలీసు ప్రజావాణికి సోమవారం 19 ఫిర్యాదులు

MBNR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారలు నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీసు ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు పోలీసు ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ వెల్లడించారు.

February 23, 2026 / 02:48 PM IST

అందుకే లడ్డూ కల్తీపై చర్చించాలి: బొత్స

AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఈ నెల 26న మండలిలో చర్చ జరుగుతుందని MLC బొత్స సత్యానారాయణ వెల్లడించారు. ఇందాపూర్ సంస్థ రూ.560 ఇచ్చే నెయ్యిని తిరుమలలో రూ.658లు ఇస్తున్నారు.హోల్‌సేల్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానానికి తక్కువ ధరకు రావాలి కానీ, రూ.100 అధికంగా ఎందుకు తీసుకుంటున్నారు. CM నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేసినందుకే మేము చర్చించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.

February 23, 2026 / 02:45 PM IST

గోరికొత్తపల్లిలో కనీస వసతుల లోపం

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలం ఏర్పడి సంవత్సరకాలం దాటినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ATM, బస్ సెంటర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని MLA దృష్టికి తీసుకెళ్లి కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 23, 2026 / 02:45 PM IST

కాసేపట్లో కేబినెట్ భేటీ

కాసేపట్లో మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులు విడుదలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

February 23, 2026 / 02:44 PM IST

సంక్లిష్టంగా భారత్ సెమీస్ అవకాశాలు..?

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి పాలవ్వడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ ఓటమితో భారత్ -3.800 నెట్ రన్ రేట్‌తో గ్రూప్-1లో చివరి స్థానంలో ఉంది. దీనివల్ల భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ సెమీస్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.

February 23, 2026 / 02:44 PM IST

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పుల్లారావు పేర్కొన్నారు.

February 23, 2026 / 02:43 PM IST

పాడేరులో అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష

ASR: పాడేరు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు సోమవారం రిలే నిరాహార దీక్షకు దిగారు. రూ.26వేల కనీస వేతనం, 1810 మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్, గ్రాట్యుటీ మార్గదర్శకాలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్‌తో పాటు రూరల్, అర్బన్ తేడాలేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:42 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: వనపర్తి మార్కెట్ యార్డులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామానికి చెందిన పరశురాం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందేలా చూస్తారని వారికి ధైర్యం చెప్పారు.

February 23, 2026 / 02:41 PM IST

పులి కలకలం.. ప్రజలకు ఎమ్మెల్యే హెచ్చరిక

JGL: భీమవరం మండలంలోని మోత్కురావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం అటవీ అధికారులతో సమీక్షించారు. మోత్కురావుపేట-చందుర్తి అటవీ మార్గంలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి కదలికలు ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావొద్దన్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

February 23, 2026 / 02:39 PM IST

రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG: మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేశారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. స్థానిక సమస్యలైన తాగునీరు, పారిశుధ్యం, అభివృద్ధిని విస్మరించి, ప్రజల దృష్టి మరల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS నేతలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు.

February 23, 2026 / 02:39 PM IST

తాడిపత్రిలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

ATP: కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది పవన్ కుమార్‌పై సీఐ విక్రమసింహా దౌర్జన్యం చేసినందుకు నిరసనగా తాడిపత్రి న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.

February 23, 2026 / 02:37 PM IST

మూడు అంశాలపై చర్చించాలి: బొత్స

AP: BACలో మూడు అంశాలపై చర్చించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ‘పంటలకు గిట్టుబాటు ధరపై మండలిలో చర్చ జరగాలని కోరాం. యూనివర్సిటీ పేరుతో విశాఖలో రైతుల భూములను దోచుకోవాలని చూస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూముల దోచిపెట్టాలనే ఆలోచనపై చర్చించాలని డిమాండ్ చేశాం. తిరుమల లడ్డూ అంశంపైనా చర్చ జరగాలని అడిగాం’ అని వెల్లడించారు.

February 23, 2026 / 02:37 PM IST