KMM: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ సోమవారం సీపీఎస్ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. కూసుమంచి మండలం, జీళ్ళ చెరువు కాంప్లెక్స్ మీటింగ్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లెకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
విజయ్, రష్మికల పెళ్లి ఈనెల 26న ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి నికర ఆస్తి ఎంత ఉండవచ్చు అనే చర్చ SMలో జోరుగా సాగుతోంది. విజయ్కు జూబ్లీహిల్స్లో రూ.15 కోట్ల విలువైన బంగ్లా ఉండగా, అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.70 కోట్లుగా అంచనా. అలాగే, రష్మికకు కర్ణాటక విరాజ్పేటలో రూ.8 కోట్ల ఇల్లు ఉంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.66 కోట్లు అని సమాచారం.
NRML: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మెన్ పడిగెల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలం లింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళ సంఘ భవనం (వీవో) భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత్, వార్డు సభ్యులు రాజు, ఏఎంసీ డైరెక్టర్ నారాయణ ఉన్నారు.
NRPT: నాగర్ కర్నూల్లో చిన్నారి మృతి ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, మున్సిపాలిటీ పాత బస్టాండ్ చౌరస్తాలో సీపీఐ మండల నాయకులు, రజక సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అనంతరం చౌరస్తా వరకు ర్యాలీ చేసి ధర్నా చేశారు. సీపీఐ నాయకుడు హనుమంతు సమగ్ర దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.
TG: హైదరాబాద్ బంజారాహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ర్యాపిడో బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, అక్షిత మృతి చెందారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ హోంగార్డుగా సయ్యద్ పనిచేస్తున్నారు. ఉద్యోగం తర్వాత పార్ట్ టైంగా ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నారు. ర్యాపిడో కస్టమర్ అక్షిత కూడా ప్రాణాలు కోల్పోయింది.
NLG: కుల దురహంకారం తో పసి కందును కాలుతో తొక్కి ప్రాణాలు తీసిన కుమ్మెర ఘటన దోషులను శిక్షించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రారపు పెద్దులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపి కుల దురహంకారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
KMR: కామారెడ్డి పట్టణాన్ని పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఈ కార్య క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
AP: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై చర్చించారు. త్వరలో మెగాజాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అందులో టీచర్ల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కల్తీ పాల కారణంగా మృతి చెందిని కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
PLD: విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కారంపూడి సీఐ పి. శరత్ బాబు సూచించారు. సోమవారం కారంపూడిలోని ఓ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈగల్ క్లబ్స్ ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేయాలని ఈగల్ క్లబ్ ప్రాముఖ్యతను వివరించారు.
MBNR: స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా అని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల్ శ్రీనివాస్ సాగర్ అన్నారు. సోమవారం సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాబా తన పాటలతో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు.
MDK: ప్రజల దూర భారాన్ని, ప్రజల సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నిజాంపేటలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని, ప్రజలదూర భారాన్ని, ప్రయాణ బత్యాల్ని, సమయాభావాన్ని తగ్గించడం కోసమే ఏర్పాటు చేశామన్నారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. మున్సిపాలిటీ అభిరుద్దికి సహకారం అందచేస్తామని అన్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్గా T20 WC బరిలోకి దిగిన భారత్కు దక్షిణాఫ్రికా భారీ షాక్ ఇచ్చింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడగొట్టినప్పటికీ బౌలర్లు 180+ స్కోర్ను ఇచ్చారు. ఇక బ్యాటింగ్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. ఈ ఒక్క ఓటమితో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందన్న ఆశలు అభిమానుల్లో సన్నగిల్లాయి.
KNR: గన్నేరువరం మండలంలోని రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. గన్నేరువరంలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సిబ్బందిని నియమించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
MNCL: క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిణామాలపై కాంగ్రెస్పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మాజీ అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్ సోమవారం మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన కూడా ఉందని గుర్తు చేశారు.