ATP: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్లైన్ వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై ఎస్సై సత్యనారాయణ ఈరోజు దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,150 నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక కోడిపుంజు, 5 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
NZB: బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఆజీఎస్ కింద మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ వంశీ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు వెచ్చించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో సర్పంచ్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KRNL: పత్తికొండలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఎక్స్పో సందర్భంగా భారతమండపంపై దాడిని ఇవాళ మండల అధ్యక్షుడు కరణం నరేష్ తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ డిమాండ్ చేశారు. కనేకల్ అంబేద్కర్ పాఠశాల వద్ద ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బస్సులు నడపాలని, వాహనదారులు విద్యార్థులకు లిఫ్ట్ ఇచ్చి పరీక్షా కేంద్రాలకు చేర్చి సహకరించాలని కోరారు.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మున్నా’ మూవీ 2007లో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 2026 మార్చి 6న ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇలియానా నటించింది.
TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టయ్యారు. బాన్సువాడ వెళ్తున్న ఆయన్ని పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పీఎస్కు రాజాసింగ్ను తరలించారు. బాన్సువాడ, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 23న ఉదయం 10:30 గంటలకు జిల్లా స్థాయి భౌతిక, రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ జరగనుంది. ఈ విషయని మెదక్ డివిజన్ అధ్యక్షుడు ఎల్.మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు.
W.G: బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉమ్మడి గోదావరి జిల్లాల రెడ్డి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి కృష్ణారెడ్డి కొనియాడారు. ఆదివారం మార్టేరులో ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన ధీరుడు నరసింహారెడ్డి అని కొనియాడారు.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి, బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు.
NGKL: తాడూర్ మండల కేంద్రంలోని మూడో వార్డులోని బొడ్రాయి వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ సంద మల్లయ్య ఇవాళ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. భూగర్భ డ్రైనేజ్ వల్ల వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తీరి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మనం స్నాక్స్ తినే టమోటా సాస్ అత్యంత ప్రమాదకరం. కంపెనీలు నో యాడెడ్ షుగర్ అని ప్రచారం చేసినా.. అది వాస్తవం కాదు. మీరు ఒక టీస్పూన్ సాస్ తింటే ఒక టీస్పూన్ చక్కెర తిన్నట్లే. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మనం తాగే పానీయాలు మన శరీరానికి తెలియకుండానే భారీ స్థాయిలో చక్కెరను అందిస్తున్నాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
E.G: రాజమండ్రిలోని దానవాయిపేట మదీనా మసీదు అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని డీడీ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఇంటర్, పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని స్వయంగా రుచి చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు బాగున్నాయని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు.