TG: రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు. ఆయిల్ పామ్ ను మరింత ప్రోత్సహించాలని కేంద్రాన్ని కూడా అడిగానన్నారు. పామాయిల్ దిగుమతిపై పన్ను పెంచితే.. దేశంలోని రైతులకు మేలు కలుగుతుందని చెప్పానన్నారు. ఆయిల్ రిఫైనరీకి కూడా రేపు శంకుస్థాపన చేస్తామన్నారు.