TG: రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు ఇవాళ్టి నుంచి బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సమాఖ్య ప్రతినిధులతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి డిప్యూటీ సీఎంతో చర్చలు జరగనున్నాయి. కాగా, తమ డిమాండ్లు నెరవేర్చేవరకు కళాశాలలు బంద్ పాటిస్తాయని నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.