AP: YS రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. ‘ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏంటి?. YS చనిపోయారని నిర్ధారణ కాకముందే.. మీరు CM పదవి కోసం సంతకాలు తీసుకున్నారు. బాబాయిని కిరాతకంగా చంపింది జగన్ కాదా?. తల్లి, చెల్లిని రోడ్డున పడేసిన విషయం గుర్తు లేదా?. పదవి గురించి తప్ప.. జగన్కు మరో ఆలోచన లేదు’ అని పేర్కొన్నారు.