AP: రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.