CTR: పలమనేరు అర్బన్ సీఐగా మురళీమోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ నరసింహారాజును పలు ఆరోపణల నేపథ్యంలో అధికారులు వీఆర్కు బదిలీ చేశారు. పలమనేరు రూరల్ సీఐగా ఉన్న మురళీమోహన్ను అర్బన్కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరులో శాంతి భద్రతలు కాపాడుతానని కొత్త సీఐ తెలిపారు. ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.