VZM: మహిళలకు స్త్రీ శక్తి పధకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. దీనికి నిరసనగా గురువారం రాజాం పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు మార్కెట్ యార్డ్ నుంచి స్దానిక MRO ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు రామూర్తినాయడు డిమాండ్ చేశారు.