కోనసీమ: ఇటీవల ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 40 మందికి రూ.18,40,380 సీఎం సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి. చెక్కులను గురువారం మండపేట టీడీపీ కార్యాలయంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.