RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో వినాయక నిమజ్జనం, పారిశుధ్యంపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిష్టయ్య గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లు,పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి అంశాలపై తగిన సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.