TG: HYD మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి, L&T, CMD మధ్య అంగీకారం కుదిరింది. మెట్రో మొదటి దశను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం.. రూ.13వేల కోట్ల L&T అప్పులను టేకోవర్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ తప్పుకోనుంది.