TG: కరీంనగర్కు చెందిన వంకాయల మహేశ్వర్ అనే వ్యక్తి జిల్లా సహకార కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కోడూరు హరీష్పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తన పని చేస్తానని చెప్పి హరీష్ రూ. 11వేల లంచం తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుని పని చేయకపోగా అడిగితే కులం పేరుతో దూషించాడని కూడా ఆరోపించాడు.