కర్ణాటక ముడా స్కామ్ కేసులో రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సీఎం సిద్ధ రామయ్య, మరికొందరికి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. రూ.100 కోట్ల విలువైన 92 స్థిరాస్తులను మనీలాండరింగ్ నిబంధనల కింద అధికారులు జప్తు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ.400 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. మైసూరు లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ ఈ కేసు విచారణ చేస్తోంది.