TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, షేక్పేట్ డివిజన్లో పోలింగ్ బూత్-30లో ఈవీఎం మొరాయించింది. ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. టెక్నికల్ అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తున్నారు. కాగా, శ్రీనగర్కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్లో పవర్ కట్ అయినట్లు సమాచారం.