AP: మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. మృతులకు సంతాపం, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అలాగే వడ్డెర సంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులపై చర్చించింది. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీమాఫీ ఆమోదించింది.