AP: రాయలసీమలో హార్టికల్చర్ను ప్రోత్సహిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘దేశంలో ఎక్కువ పండ్ల సాగు జరిగేది APలోనే. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలను విస్తరిస్తాం. వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచుతున్నాం. రాష్ట్రంలో ఆక్వా సాగును మరింతగా ప్రోత్సహిస్తాం. ప్రపంచానికి ఏపీ ఆక్వా హబ్గా మారుతుంది. భూగర్భ జలాలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.