AP: రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే మూడు పార్టీలు కలిశాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన నాయకుడు NTR అని తెలిపారు. ‘మహిళా యూనివర్సిటీ తెచ్చిన ఘనత NTRదే. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక యూనివర్సిటీ తెచ్చారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.