AP: సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ అధినేత జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు ధర్నాలా? అని ధ్వజమెత్తారు.