ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద వర్ధంతి నేడు. పశ్చిమ దేశాలకు యోగా, ధ్యానాన్ని పరిచయం చేసి ‘ఫాదర్ ఆఫ్ యోగా ఇన్ ది వెస్ట్’గా ఆయన పేరుగాంచారు. ఆయన రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక గ్రంథంగా నిలిచింది. క్రియాయోగ విద్యను విశ్వవ్యాప్తం చేసిన ఆయన, 1952 మార్చి 7న తుదిశ్వాస విడిచారు. ఆయన బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి.