AP: వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిందని, కాంట్రాక్టర్లకు రూ.1.35 లక్షల కోట్ల బకాయిలు పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఆయన చెప్పారు.