బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ‘డీఎంకే ఫైల్స్’ అంటూ స్టాలిన్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేసిన రెండు మూడు రోజులకే ఈ దాడులు చేయడం గమనార్హం.
తాను బీజేపీలో చేరితే.. ఒక్కరోజులోనే మంత్రిగా ఛాన్స్ ఇస్తామని ఓ నాయకుడు నాకు ఆఫర్ ఇచ్చారంటూ నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య (Former MP Ramya)వెల్లడించడం సంచలనం రేపింది. ఆ ఆఫర్ను తాను అప్పుడే తిరస్కరించానని ఆమె తెలిపారు.
సౌత్ ఆప్రికా నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు (Kuno National Park) తీసుకొచ్చిన మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. చీతా చనిపోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి
చందా చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోని కారణంగా వారందరి బ్లూ టిక్ లు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని పునరుద్ధరించింది. వారి ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విటర్ జోడించింది. అయితే ఈ బ్లూ టిక్ కోసం ఆ ప్రముఖులందరూ చందా చెల్లించలేదని తెలుస్తోంది.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం కేదరనాథ్ లో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తోంది. ఈ కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్(Registration) ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
వడోదర మున్సిపల్ కార్పొరేషన్(Vadodara Municipal Corporation)లో పనిచేస్తున్న ఓ స్వీపర్కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు అందుకున్న స్వీపర్ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యారు. వడోదర మెట్రోపాలిటన్ మునిసిపాలిటీలో స్వీపర్(Sweeper)గా పనిచేస్తున్న శాంతిలాల్ సోలంకి(Shanthi lal solanki) ఇంటిని సీజ్ చేయాలంటూ బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన పదేపదే మోడీని టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (software engineer) ట్విట్టర్లో రాసిన లేఖ వైరల్ అవుతోంది.
జేడీఎస్ నాయకుడు హెచ్డి కుమారస్వామి (HD Kumaraswamy) స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, అలసట కారణంగానే కుమారస్వామి నీరసించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు.