ఇటీవల కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చడం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం.. తాజాగా పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చడంపై మమతా బెనర్జీ స్పందించారు. ప్రజాస్వామ్యం వెళ్లిపోతే అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారు. కానీ ఇవాళ ఏకంగా రాజ్యాంగం మార్చేశారు.
ట్విట్టర్(twitter)లో వెరిఫికేషన్ టిక్ కోల్పోయిన చాలా మందిలో ఒకరు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). అయితే తాను డబ్బులు కట్టినా కూడా తనకు బ్లూ టిక్(blue tick) రాలేదని ఆయన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. బిగ్ బీ ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సంచార ప్రచార వాహనాలు ఔరంగబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ ప్రచార రథాలకు మరాఠా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
తొలగించిన పాఠ్యాంశాన్ని యథావిధిగా పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ డిమాండ్ చేసింది. విద్యను కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు తొలగిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి తొలగిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం తన అధికారిక బంగ్లా(Official Bungalow)ను ఖాళీ చేసే అవకాశం ఉంది. మరోవైపు అతని వస్తువులను అతని అధికారిక నివాసం నుంచి 10 జన్పథ్లోని అతని తల్లి సోనియా గాంధీ ఇంటికి ఇప్పటికే మార్చారు.
దేశంలోని మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని బెంగళూరు(Bengaluru)లో నిన్న ప్రారంభించారు. లాగ్9 మెటీరియల్స్(Log9 Materials) బ్యాటరీ-టెక్నాలజీ స్టార్టప్ ఈ మేరకు మొదలుపెట్టింది.
యూపీ(uttar pradesh)లోని హమీర్పూర్(hamirpur) జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ ధరించలేదని పోలీసులు వెయ్యి రూపాయల చలాన్ నోటీస్ పంపించారు. అంతేకాదు ఆ తర్వాత అతను ఫైన్ కూడా కట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ (Karimnagar) – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది.
రిలయెన్స్ (Reliance) ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని మాజీ గవర్నర్ సత్యపాల్ (Satya Pal Malik) తెలిపారు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 2002 గోద్రా అల్లర్ల కేసు(Godhra Riots Case)లో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు(supreme Court) బెయిల్ మంజూరు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు దోషులకు బెయిల్ను తిరస్కరించింది.
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.51కోట్లుగా వెల్లడించారు.