మరికొన్ని గంటల్లో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడనుంది. ఆ అధ్భుత క్షణాలు చూసేందుకు యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ల్యాండర్ ల్యాండ్ అయ్యే చివరి 17 నిమిషాలు కీలకం అని ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ సందర్భంగా ఆగస్టు 23 సాయంత్రం అన్ని పాఠశాలలను ఒక గంట పాటు తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఓ 8 ఏళ్ల బాలుడు లిప్ట్లో ఇరుక్కొన్నాడు. అరిచినా ఎవరూ రాలేదు. దీంతో చేసేదేమీ లేక.. అందులో కూర్చొనే హోం వర్క్ చేశాడు. ఈ ఘటన హర్యానా ఫరీదాబాద్లో జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకూ ఆ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో వివిధ పనులు నిమిత్తం రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.
చంద్రయాన్-3కి సంబంధించి రేపు కీలక ఘట్టం జరగనుంది. విక్రమ్ ల్యాండర్ రేపు జాబిలిపైకి చేరనుంది. ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మరో రోజు చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుందని ఇస్త్రో శాస్త్రవేత్త తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.