BDK: జూలూరుపాడు మండలంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మైదానాలు నిర్వహణ లోపంతో పాడైపోతున్నాయి. వ్యాయామం, వాకింగ్కు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో యువత దూరమవుతోంది. పిచ్చిమొక్కలు, చెత్తతో మైదానాలు దెబ్బతినగా, వెంటనే అభివృద్ధి చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.