W.G: విద్యార్థులు పరీక్షల్లో సత్ఫలితాలు సాధించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విశ్రాంత ఉద్యోగి రుద్రరాజు బలరామరాజు రూ.3 లక్షల సొంత వ్యయంతో నిర్మించిన యోగా శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు రోజూ అరగంట పాటు యోగా సాధన చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని మంత్రి సూచించారు.