తమిళ హీరో ధృవ్ విక్రమ్ నటించిన ‘బైసన్’ మూవీ తమిళంలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. తనకు స్వయంగా కాల్ చేసి అభినందించారని దర్శకుడు మారి సెల్వరాజ్ తెలిపారు. ‘సూపర్ మారి. బైసన్ చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. మూవీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అని చెప్పారు’ అని పేర్కొన్నారు.