KDP: సి.కె దిన్నె పరిధిలోని ఊటుకూరు సర్కిల్ వద్ద సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.