దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రూ.1,500 – 2,000 కోట్లు వసూలు చేయడం ఖాయమని చెప్పాడు. అదే జరిగితే సౌత్ సినిమాలన్నీ తోక ముడవాల్సిందేనని అన్నాడు. సౌత్ యాక్షన్ చిత్రాలు పాత కథనాలతోనే సాగుతున్నాయని, కానీ ‘ధురంధర్’ సిరీస్ బాలీవుడ్ యాక్షన్ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నాడు.