మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఇన్స్టా ఐడీ, ఈ మెయిల్ వివరాలను గూగుల్ సంస్థ పోలీసులకు అందజేసింది. మరిన్ని వివరాల కోసం టెలికాం సంస్థకు పోలీసులు లేఖ రాయనున్నారు. టెలికాం సంస్థ నుంచి వచ్చే వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించనున్నారు.