అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.
US not flying any balloons:అమెరికా (america) అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ చైనా (china) నిఘా పెట్టిందని.. వాటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు (balloons) కనిపించాయని పేర్కొంది. అమెరికా బెలూన్లు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 సార్లకు (10 times) పైగా వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.
No Evidence Prabhakaran Is Alive: లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) బతికే ఉన్నారని తమిళ నేషనలిస్ట్ మూమెంట్ (TNM) నేత పి.నెడుమారన్ (P.Nedurmaran) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను శ్రీలంక ఆర్మీ కొట్టిపారేసింది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక సైన్యం స్పష్టం చేసింది.
Chicken prices : చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు..! : చికెన్ ప్రియులకు షాక్. చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది. కిలో చికెన్ ధర ఏకంగా రూ. 720కి చేరుకుంది. అమ్మో... ఇంత రేటు అయితే... చికెన్ ఎలా తింటాం అని భయపడుతున్నారా..? కంగారుపడకండి.
ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన భార్య నటాసా స్టాంకోవిక్ తో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని భావించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప బాధిత మృతుల సంఖ్య 34 వేలు దాటింది. ఇంకోవైపు ఆదివారం టర్కీ దక్షిణ ప్రాంతమైన కహ్రమన్మరాస్ లో 4.7 తీవ్రతో భూకంపం వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అంతేకాకుండా భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా నిర్మించిన భవనాలు కూడా కూలడం పట్ల 131 మంది భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు.
Indian aircraft lands in Turkey:టర్కీ (turkey), సిరియా(syria)లో‘ఆపరేషన్ దోస్త్’ (operation dost) పేరుతో భారత్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఏడో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (air force) విమానంలో మందులను పంపించింది. ఆదివారం ఉదయం ఆదానా (adana) ఎయిర్ పోర్టులో ఐఎఎఫ్ సీ 17 (IAF C17) విమానం దిగింది.
టర్కీలో 3 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో 1800 మంది ఇస్తాంబుల్ లో ఉండగా, 250 మంది అంకారాలో ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ భూకంపం ధాటికి 25 వేల మంది చనిపోయినట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది
టర్కీ (turkey), సిరియా (syria), భూకంప (earth queake) మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. శిథిలాల కింద నుంచి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య (death toll) 25 వేలు దాటింది.
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్లడించారు.
టర్కీ (turkey), సిరియాలలో (syria) భూకంప (earthquake) మృతుల సంఖ్య 21,000 దాటింది. భారీ మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు, ఆకలి బాధలు వంటి వివిధ కారణాలతో మరణాలు (death toll) రోజురోజుకు పెరుగుతున్నాయి. భూకంప సహాయక చర్యల్లో అత్యంత ముఖ్యమైన 72 గంటల సమయం ముగియడంతో శిథిలాల మధ్య చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిల్లాయి.
దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది.